ETV Bharat / state

భూములిచ్చిన రైతులు గురించి ప్రభుత్వానికి పట్టదా..?

author img

By

Published : Apr 12, 2020, 4:12 PM IST

రాజ‌ధాని రైతులు 115 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టదా అంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లిస్తూ రాజధాని రైతులకు కౌలు ఇవ్వరా అని నిలదీశారు. కాంట్రాక్టర్లకు రెడ్ కార్పెట్ వేసి రాజధానికి భూములిచ్చిన రైతులను బానిసల్లా చూడటం దుర్మార్గమని మండిపడ్డారు.

anagani-satyaprasad
anagani-satyaprasad

రాజధాని రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని వైకాపా ప్రభుత్వం మోసగించిందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. క‌మీష‌న్లు దండుకునేందుకే వైకాపా... కాంట్రాక్టర్లకు 6 వేల 500 కోట్లు విడుద‌ల చేశారని దుయ్యబట్టారు. కౌలు రైతుల‌ను ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వానికి చేతులు రావ‌డం లేదని మండిపడ్డారు.

క‌రోనా మహమ్మారి వెంటాడుతున్నా... భౌతిక దూరం పాటిస్తూ 115 రోజుల నుంచి రాజ‌ధాని మ‌హిళలు, రైతులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన‌ట్లుగా వ్యవ‌హ‌రిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌ష్టపోతున్న రైతులను ఆదుకోవాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: చైనాలో మళ్లీ కరోనా ప్రకంపనలు- అమెరికాలో వికృత రూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.