ETV Bharat / state

Amaravathi lands: 'సంతోషంగానే భూములిచ్చాం... ఎవరూ బలవంతంగా లాక్కోలేదు'

author img

By

Published : Jul 4, 2021, 9:08 PM IST

తెదేపా హయాం (TDP rulling)లో అమరావతి ప్రాంత రైతుల భూమిని (Amaravathi lands) బలవంతంగా లాక్కున్నారన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(MLA Alla ramakrishnareddy) వ్యాఖ్యలను ఉద్ధండరాయునిపాలెంకు చెందిన రైతు ఖండించారు. రాజధాని నిర్మాణానికి తాము ఇష్ట పూర్వకంగానే భూములిచ్చామని, ఈ అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే(Mangalagiri MLA) రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్ధండరాయునిపాలెంకు చెందిన రైతు
ఉద్ధండరాయునిపాలెంకు చెందిన రైతు

ఉద్ధండరాయునిపాలెంకు చెందిన రైతు

రాజధాని అమరావతి (amaravathi)లో అసైన్డ్ రైతుల నుంచి... గత ప్రభుత్వ మంత్రులు భయపెట్టి భూములు లాక్కున్నారన్న గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (MLA alla rama krishna reddy) వ్యాఖ్యలను అమరావతి రైతు ఖండించారు. తామంతా అమరావతి నిర్మాణానికి సంతోషంగానే భూములిచ్చామని.. ఎవరూ బలవంతంగా లాక్కోలేదని ఉద్ధండరాయునిపాలెంకు చెందిన ఓ రైతు పేర్కొన్నారు.

తమను అకారణంగా రామకృష్ణారెడ్డి మధ్యలో లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవసరాల కోసం కొంత భూమిని అమ్ముకున్నామని... మిగిలిన దాంట్లో సాగు చేసుకుంటున్నామని చెప్పారు. కావాలంటే రామకృష్ణారెడ్డి వచ్చి పరిశీలించుకోవాచ్చని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వానికి తమపై ప్రేమ ఉంటే కౌలు చెల్లింపులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దేవభూమిలో 21 సంవత్సరాలు.. 10 మంది సీఎంలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.