ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1pm

author img

By

Published : Nov 8, 2022, 12:59 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

.

  • ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. కేసు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
    ఓబులాపురం గనుల కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్యాన్సర్‌తో పోరాడుతూ సేవ మరవని కండక్టరమ్మ..
    ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ రోజుల్లో యల్లా శ్యామల మాత్రం మానవ సేవే మాధవ సేవగా భావించి అనాథ పిల్లల్ని, దుకాణాల్లో పనిచేసే వాళ్లూ, చెత్త ఏరుకొనే పిల్లల్ని చేరదీసి ఉన్నంతలో పోషిస్తూ చదువు చెప్పిస్తోంది ఈ కండక్టర్. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా.. తనకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చినా చికిత్స తీసుకుంటూనే ఉద్యోగం, సేవా కొనసాగిస్తున్నారు. అందుకే ఈ ఈ కండక్టరమ్మ సేవలమ్మ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అల్లరి చేశాడని రెండేళ్ల పసివాడిని కొట్టి చంపిన తండ్రి
    కుమారుడు పుడితే ఎంతో సంబురపడిపోయే ఈ రోజుల్లో, ఓ తండ్రి తన కుమారుడినే అంతమొందించాడు. ఇప్పుడిప్పుడే బుజ్జిబుజ్జి అడుగులేస్తూ ముద్దుముద్దు మాటలు పలుకుతున్న ఆ చిన్నారిని మృత్యు ఒడిలోకి పంపాడు. పసివాడు అల్లరి చేస్తున్నాడని.. కనికరం లేకుండా కన్నతండ్రే దారుణంగా కొట్టి చంపాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెద్దలు ఒప్పుకోలేదని ప్రాణాలు వదిలిన ప్రేమికులు
    ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్న ఓ యువ జంట ఆత్మహత్య చేసుకుంది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన బాపట్లజిల్లా చినగంజాం మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశవ్యాప్తంగా కనుల విందుగా కార్తీక దీపోత్సవం
    త్రిపురాసుడిపై మహాశివుడి విజయానికి గుర్తుగా జరుపుకొనే పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేశంలోని పలు దేవాలయాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. దీపాలు వెలిగించి కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ దేవ్​ దీపావళిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు నదీతీరంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. దీపాల వెలుతురులో వారణాసి సహా పలు దేవాలయాలు దేదీప్యమానంగా వెలిగాయి. కాశీ మహాక్షేత్రంలోని చిత్రాలను మోదీ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వాటితో పాటు మరికొన్ని అద్భుతమైన చిత్రాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇన్సూ​రెన్స్​ కంపెనీకి టోకరా.. రూ.1.60 కోట్లు కాజేసిన మహిళ!
    ఓ మహిళ ఇన్సూ​రెన్స్​ కంపెనీని బురిడి కొట్టించింది. చనిపోయిన తన భర్త పేరు మీద ఇన్సూ​రెన్స్ పాలసీ తీసుకుని ఏకంగా రూ.1.60 కోట్లు కాజేసింది. ఆలస్యంగా మోసాన్ని తెలుసుకున్న సదరు బీమా సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!
    Cop 27 Rishi Sunak : పర్యావరణ సదస్సులో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అర్థాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటికెళ్లిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
    దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోహిత్ కెప్టెన్సీపై ఐసీసీకి మిథాలీ​ లేఖ.. జట్టుపై ప్రభావం పడకుండా..
    టీ20 ప్రపంచకప్‌లో ఇబ్బందిగా పరుగులు చేస్తున్న కెప్టెన్​ రోహిత్ శర్మపై కీలక వ్యాఖ్యలు చేసింది మహిళా జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్. ఐసీసీకి రాసిన వ్యాసంలో ఆమె హిట్​మ్యాన్​ సారథ్యం గురించి ప్రస్తావించింది. ఏం రాసిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సుధీర్​తో ప్రేమ, పెళ్లి.. రష్మి ఏం చెప్పిందంటే?
    సుధీర్​తో తనకున్న బంధం గురించి మాట్లాడింది నటి రష్మి గౌతమ్​. తామిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమా?, అసలు పెళ్లి ఆలోచన ఉందా లేదా? అనేది చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.