wild boar attack: కూలీలపై అడవిదున్నలు దాడి.. ఇద్దరు కూలీలు మృతి

author img

By

Published : May 15, 2022, 12:21 AM IST

అడవి దున్నల దాడిలో ఇద్దరు మృతి

Wild Boar Attack on Labours: జీడిపిక్కలు ఏరుతున్న కూలీలపై అడవిదున్నలు దాడి చేసిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్​ఎన్​డీపేట శివారులో దేరాకొండ ప్రాంతంలో జరిగింది.

ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్​ఎన్​డీపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక జీడిమామిడి తోటలో జీడిపిక్కలు ఏరుతున్న కూలీలపై అడవి దున్నలు అకస్మాత్తుగా దాడిచేశాయి. ఈ దాడిలో కట్టవ రామయమ్మ(70) అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరోకరు మృతిచెందారు. మరో మహిళ పంది భవాని స్వల్పగాయాలతో బయటపడింది. ఆమె ప్రస్తుతం ఎల్ఎన్​డీపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: విద్యార్థులపై ఆ కేసులు ఎత్తివేయాలి - సీపీఐ నేత రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.