ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక జీడిమామిడి తోటలో జీడిపిక్కలు ఏరుతున్న కూలీలపై అడవి దున్నలు అకస్మాత్తుగా దాడిచేశాయి. ఈ దాడిలో కట్టవ రామయమ్మ(70) అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరోకరు మృతిచెందారు. మరో మహిళ పంది భవాని స్వల్పగాయాలతో బయటపడింది. ఆమె ప్రస్తుతం ఎల్ఎన్డీపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: విద్యార్థులపై ఆ కేసులు ఎత్తివేయాలి - సీపీఐ నేత రామకృష్ణ