ETV Bharat / state

సుడిగాలి బీభత్సం.. నేలమట్టమైన పాకలు

author img

By

Published : Aug 5, 2020, 9:37 PM IST

east godavari district
సుడిగాలి బీభత్సం.. నేలమట్టమై పాకలు

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం గొల్లపాలెంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పశువుల పాకలు ధ్వంసమయ్యాయి. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లి గ్రామ శివారు గొల్లపాలెంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. పచ్చని వరిచేళ్ల మీదుగా నీటిని పోలిన సుడిగాలి ఏర్పడి గ్రామం మీదకు వచ్చిందని స్థానికులు తెలిపారు. సుడి గాలి విపరీతంగా రావడంతో మూడు పశువుల పాకలు, మూడు కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఒక వంట షెడ్డు పైకప్పు ఎగిరి కింద పడింది. ఈ సంఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి రాజధానిగా అమరావతే ఉంటుంది: గొల్లపల్లి సూర్యారావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.