ETV Bharat / state

నాడు - నేడు విధుల నుంచి తప్పించాలని ఉపాధ్యాయ సంఘాల నిరసన

author img

By

Published : Jun 8, 2020, 8:05 PM IST

నాడు - నేడు విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమైక్య మండల శాఖ ప్రతినిధులు నిరసన తెలిపారు. టీచర్లకు బోధనేతర పనులు అప్పగించవద్దని డిమాండ్​ చేశారు.

Teachers protest
ఉపాధ్యాయుల నిరసన

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మండల విద్యా వనరుల కేంద్రం వద్ద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమైక్య మండల శాఖ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధించి ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

విలీన మండలాల్లో డిప్యుటేషన్ రద్దైన ఉపాధ్యాయుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొని.. ఉన్నతాధికారులకు మెమోరాండం అందజేశారు.

ఇవీ చూడండి...

'తెరిస్తే నష్టపోతాం.. అంతా చక్కబడ్డాకే అమ్మకాలు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.