MPP: జనసేన మద్దతుతో కడియం ఎంపీపీ పదవి తెదేపా కైవసం

author img

By

Published : Sep 24, 2021, 6:56 PM IST

tdp

తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ(MPP) పదవి తెదేపాకు దక్కింది. కడియం మండలంలో నాలుగు ఎంపీటీసీలు ఉన్న తెదేపాకు 8మంది ఎంపీటీసీ సభ్యులున్న జనసేన మద్దతు ఇచ్చింది. కాగా వైకాపా 9ఎంపీటీసీల్ని గెలుచుకుంది.

జనసేన మద్దతుతో తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీపీ(MPP) పదవి తెదేపాకు దక్కింది. కడియం ఎంపీపీగా సత్యప్రసాద్ ఎన్నికయ్యారు. కడియం మండలంలో తెదేపా- 4, జనసేన- 8, వైకాపా- 9 మంది ఎంపీటీసీలు గెలిచారు. కాగా కడియం ఎంపీపీ పదవికి తెదేపా, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే మెజారిటీ ఉన్న తమకే ఎంపీపీ ఇవ్వాలని వైకాపా ఎంపీటీసీల డిమాండ్​ చేశారు. జనసేన, తెదేపా ఉమ్మడి బలం 12 మంది సభ్యులు కావడంతో ఎంపీపీ పదవి తెదేపాకు దక్కింది.

ఇదీ చదవండి: మొదటి రెండున్నరేళ్లు మాకు.. కాదు మాకే.. పార్టీల మధ్య ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.