ETV Bharat / state

'కాటన్ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించండి'

author img

By

Published : Jul 8, 2020, 1:38 PM IST

sir arthor cotton statue in p gannavaram east godavari district
సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి ముసుగు

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి వేసిన ముసుగు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. 4 నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ముసుగు వేశారని.. ఎన్నికలు వాయిదా పడినా ముసుగు తీయలేదని చెప్పారు.

సర్ ఆర్ధర్ కాటన్​ను రాజకీయ నాయకుడిగా భావించి ఆయన విగ్రహానికి ముసుగు వేయడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా పీ. గన్నవరం వాసులు అంటున్నారు. స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా గ్రామంలో ఉన్న కాటన్ విగ్రహానికి 4 నెలల క్రితం ముసుగు వేశారు.

రాజకీయ నాయకుడు కాకపోయినా ముసుగు వేయడమే విచిత్రం అనుకుంటే.. ఎన్నికలు వాయిదా పడినా ఇప్పటికీ ముసుగు తీయకపోడం అన్యాయమని స్థానికులు వాపోతున్నారు. ఇది తప్పిదమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ముసుగు తొలగించాలని అధికారులను కోరుతున్నారు.

ఇవీ చదవండి...

తండ్రి అడుగుజాడల్లో సీఎం జగన్ నడుస్తున్నారు: కొడాలి నాని

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.