ETV Bharat / state

పాఠశాలకు పూర్వ విద్యార్థిని వితరణ

author img

By

Published : Jul 27, 2020, 11:27 PM IST

east godavari district
పాఠశాలకుకు పూర్వ విద్యార్థిని వితరణ

బడి రుణం తీర్చుకుందామనే నినాదంతో ఒక పూర్వ విద్యార్ధిని ముందుకు వచ్చి పాఠశాలకు రూ. 26,500 వితరణగా అందించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లిలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లిలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థిని కడియాల పాపాయమ్మ 26,500 రూపాయలు వితరణగా అందించి. దీంతో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. బడి రుణం తీర్చుకుందామనే నినాదంతో ఆమె ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. దీని ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థులకు త్రాగునీరు వసతి ఏర్పడింది. ఆమెను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాస్ తదితరులు అభినందించారు

ఇదీ చదవండి కరోనా కాటేస్తున్నా.. వీడని నిర్లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.