ETV Bharat / state

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, వ్యక్తి దారుణ హత్య

author img

By

Published : Mar 1, 2020, 11:20 AM IST

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జీ. మామిడాడలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

one person murdered in g. maamidada east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణహత్య

తూర్పుగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణహత్య

జీ. మామిడాడ గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి అనే వ్యక్తి తన మేనల్లుడిని కొట్టాడనే కారణంతో అదే గ్రామంలోని సూర్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లాడు. ఇంద్రారెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి, సూర్యచంద్రారెడ్డి వెళ్లగా సూర్యనారాయణరెడ్డి వారిపై కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో ఇంద్రారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. రామసుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉండగా.. సూర్యచంద్రారెడ్డికి గాయాలయ్యాయి. నిందితుడు సూర్యనారాయణరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతనికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి.. రంపచోడవరంలో గిరిజన బాలికపై అత్యాచారం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.