ETV Bharat / state

గోదావరిలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు

author img

By

Published : Oct 6, 2020, 8:48 AM IST

person missing in godavari river
గోదావరిలో యువకుడు గల్లంతు

రాజమహేంద్రవరానికి చెందిన ఐదుగురు... సరదాగా స్నానం చేసేందుకు పిచ్చుకలంక వద్దకు వచ్చారు. గోదావరిలో స్నానానికి దిగగా... ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఓ యువకుడు గల్లంతయ్యాడు. మిగతా వారు సురక్షితంగా చేరగా... గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో ఓ యువకుడు స్నానానికి దిగి గల్లంతయ్యాడు. రాజమహేంద్రవరానికి చెందిన ఐదుగురు యువకులు సరదాగా స్నానం చేసేందుకు బొబ్బర్లంక బ్యారేజీ సమీపంలోని పిచ్చుకలంక వద్దకు వచ్చారు. అక్కడ గోదావరిలో స్నానానికి దిగగా... ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల నామవరానికి చెందిన బాషా శేఖర్​(20) గల్లంతయ్యాడు. మిగిలిన నలుగురు యువకులు సురక్షితంగా బయట పడ్డారు. గల్లంతైన యువకుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆత్రేయపురం పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసినట్టు ఎస్సై సురేష్​ తెలిపారు.

ఇదీ చదవండి :

గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.