ETV Bharat / state

ఒలంపిక్స్ లక్ష్యంగా విద్యార్దులు పోటీపడాలి:ఎమ్మెల్యే గోరంట్ల

author img

By

Published : Aug 29, 2019, 3:56 PM IST

national sports day celebrations in rajamahendravaram in eastgodavari districtnational sports day celebrations in rajamahendravaram in eastgodavari district

రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ముఖ్యఅతిధిగా విచ్చేశారు.

రాజమహేంద్రవరంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం.

జాతీయ క్రీడా దినోత్సవాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. 130 కోట్లు జనాభా ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం లేదని, విద్యార్ధులు క్రీడా రంగంలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని ఆయన కోరారు. అనంతరం కోటిపల్లి నూతనంగా నిర్మించిన మోడల్‌ బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి భవాని, నగర పాలక సంస్థ కమీషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.తూర్పుకోస్తా రైల్ మజ్దూర్ యూనియన్ ఆవిర్భావ సభ

Intro:Ap_Vsp_61_29_Bhasha_Pandithula_Agitation_Av_C8_AP10150


Body:పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులు ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు భాషను పునరుద్ధరించి భావితరాలకు అందించే భాషా పండితులకు పదోన్నతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులు నల్ల జెండాలు చేత పట్టుకొని నిరసన ప్రదర్శన చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.