మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో కొలువై ఉన్న భద్రకాళి సమేత విరేశ్వర స్వామి వారిని హంస వాహనంపై ఊరేగించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై పురవీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పట్టుచీరను ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలక మండలి సభ్యలు సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
హంసవాహనంపై భద్రకాళి సమేత విరేశ్వర స్వామివారు
మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో కొలువై ఉన్న భద్రకాళి సమేత విరేశ్వర స్వామి వారిని హంస వాహనంపై ఊరేగించారు. అంతకుముందు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై పురవీధుల్లో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పట్టుచీరను ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలక మండలి సభ్యలు సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.