ETV Bharat / state

ఎంపీ సుభాష్ చంద్రబోస్​కు ప్రజాప్రతినిధులు, అధికారుల పరామర్శ

author img

By

Published : Oct 15, 2020, 11:06 PM IST

వైకాపా ఎంపీ సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ ఇటీవల మరణించారు. మంత్రి తానేటి వనిత, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు, అధికారులు..ఎంపీ స్వగృహానికి వచ్చి పరామర్శించారు.

ఎంపీ సుభాష్ చంద్రబోస్
ఎంపీ సుభాష్ చంద్రబోస్

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సతీమణి ఇటీవల మరణించారు. ఆయన్ను పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా హసన్​బాద్​లో స్వగృహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతోపాటు, వైకాపా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి, జేసీలు, వైకాపా నాయకులు... ఎంపీ బోస్​ను పరామర్శించారు. సుభాష్ చంద్రబోస్ సతీమణి సత్యనారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి : ఏలేరు వరదలో రెండు కార్లు...ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.