Marijuana: బోర్‌వెల్ లారీలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

author img

By

Published : Oct 3, 2021, 1:41 PM IST

Updated : Oct 3, 2021, 4:35 PM IST

Marijuana seizure

13:39 October 03

లారీలో వెయ్యి కిలోల గంజాయి పట్టివేత

బోర్‌వెల్ లారీలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. అద్దిరిపేట వద్ద బోర్‌వెల్ లారీలో తరలిస్తున్న రూ.2 కోట్లు విలువ చేసే వెయ్యి కిలోల గంజాయిని తుని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులకు గతంలోనూ గంజాయి రవాణాతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

"గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. నిందితులకు గతంలోనూ గంజాయి రవాణాతో సంబంధాలు ఉన్నాయి."

-రవీంద్రబాబు, ఎస్పీ

ఇదీ చదవండి: భారీ ఆధిక్యంలో మమత- విజయం నల్లేరుపై నడకే!

Last Updated :Oct 3, 2021, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.