తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ దెబ్బకు మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిత్యం శ్మశన వాటికలకు మృత దేహాల తరలివస్తూనే ఉన్నాయి. వాటితోపాటు సిబ్బంది, కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న మాస్క్ లు, గ్లౌజ్ లు, పీపీఈ కిట్లు శ్మశాన వాటికల పరిసరాల్లో కొందరు వదిలేస్తున్నారు. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట రోటరీ కైలాస భూమి వద్ద ఇలా వదిలేసిన వ్యర్థాలు పోగవతున్నాయి. నగరపాలక సంస్థ సిబ్బంది, స్మశాన వాటిక నిర్వాహకులు వీటిని తొలగించక పోవడంతో పరిసర ప్రాంతాల నివాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ మృతులతోపాటు వారి బంధువుల్లోనూ పాజిటివ్ ఉంటోందని.. అలాంటి వారు వినియోగించిన మాస్క్ లు, గ్లౌజ్ లు, ఇతర వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: