ETV Bharat / state

కోనసీమకు రైతులకు గుండె కోత.. నిండా ముంచిన వర్షాలు

author img

By

Published : Oct 14, 2020, 5:31 PM IST

ముంపునకు గురైన కోనసీమ వరిపంటలు.. రైతుల ఆందోళన
ముంపునకు గురైన కోనసీమ వరిపంటలు.. రైతుల ఆందోళన

కోనసీమ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఖరీఫ్ వరి పంట ముంపునకు గురైంది. ఫలితంగా పంట చేలు నీటిలోనే మునిగాయి. మరోవైపు మురుగు కాల్వలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి.

వాయుగుండం తీరం దాటినప్పటికీ మంగళవారం రాత్రి సైతం కోనసీమ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. సుమారు 6 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట ముంపునకు గురైంది. మురుగు కాల్వలు భారీ స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

ముంపునకు గురైన కోనసీమ వరిపంటలు
ముంపునకు గురైన కోనసీమ వరిపంటలు

మురుగు మూత వల్లే..

గోరింకల - బచ్చల పెద్దతిప్ప రాళ్ల కాల్వ వద్ద అవుట్ ఫాల్ స్లూయిస్ నుంచి నీరు వడివడిగా గోదావరిలో చేరుతోంది. అయినప్పటికీ వరిచేలు నుంచి ముంపు వేగంగా దిగటం లేదు. కొన్ని మురుగు కాల్వలు మూసుకుపోయి అధ్వానంగా మారడంతో ఈ దుస్థితి తలెత్తింది.

ముంపునకు గురైన కోనసీమ వరిపంటలు
ముంపునకు గురైన కోనసీమ వరిపంటలు

ఇవీ చూడండి:

రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల ఎకరాల్లో మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.