ETV Bharat / state

డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ నిర్వహణ నిధుల మంజూరులో జాప్యం

author img

By

Published : Sep 23, 2020, 7:56 PM IST

funding Delay  in   maintenance of Dokka Seethamma Aqueduct in p Gannavaram
పి .గన్నవరంలోని డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ నిర్వణకు నిధులు జాప్యం

తూర్పుగోదావరి జిల్లా పి .గన్నవరంలోని గోదావరి నదిపైగల డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు. పురాతన కట్టడంగా వెలుగొందుతన్న ఈ అక్విడెక్ట్ వద్ద ..మరమ్మతుల పనులున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలోని వైనతేయ గోదావరి నదిపై గల డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ నిర్వహణ పనులు చేయక అధ్వాన్నంగా తయారైంది. ఈ కట్టడం ద్వారా రాజోలు దీవిలోని సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, పి. గన్నవరం, లంకలగన్నవరం, నాగుల్​లంక, వాడ్రేవుపల్లి, మానేపల్లి, మొండెపులంక గ్రామాలకు చెందిన 3లక్షల 50 వేల మందికి తాగునీరు...50 వేల ఎకరాలకు సాగునీరు రవాణా మార్గంగా ఈ అక్విడెక్ట్ ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ కట్టడం నిర్వహణకు నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రోడ్డు దెబ్బతిని పాడైపోయింది. విద్యుత్ దీపాలు వెలగడం లేదు, హ్యాండ్ రెయిలింగ్ ఊడిపోయింది. రక్షణ గోడలమీద చెట్లు పెరిగిపోతున్నాయి. ఈ కట్టడం నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి.
రాష్ట్రంలో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.