ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభల ఉత్సవాలకు సర్వం సిద్ధం

author img

By

Published : Jan 14, 2021, 5:53 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో కనుమ పండుగ రోజు నిర్వహించే ప్రభల ఉత్వవాలకు సర్వం సిద్ధమైంది. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న వీటిని చూడటానికి ప్రజలు భారీగా తరలివస్తారు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి ప్రభలను తయారుచేస్తున్నారు. ప్రజలు వీరభద్రుడిని కొలుస్తూ శరభ శరభ అంటూ కనుమ రోజున ప్రభలను తీర్థ ప్రదేశాలకు తీసుకెళతారు.

everything is ready for prabhala in east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో ప్రభల ఉత్సవాలకు సర్వం సిద్ధం

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభల ఉత్సవాలకు సర్వం సిద్ధం

సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమ నాడు నిర్వహించే ప్రభల ఉత్సవాలకు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ పెట్టింది పేరు. ఇక్కడి ప్రబల తీర్థాలకు 400 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. కోనసీమలోని వివిధ గ్రామాల కూడలిలో కనుమ రోజు నిర్వహించే ప్రభలతీర్థాలకు ప్రజలు భారీగా తరలి వెళతారు. ప్రభలతీర్థాలు కోసం రెండు రోజులుగా నిర్వాహకులు వీటిని ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి వీటిని తయారుచేస్తున్నారు. అదేవిధంగా ఎడ్ల బండ్లను ముస్తాబు చేస్తున్నారు.

కనుమ రోజు వీటిని తీర్థ ప్రదేశాలకు తరలించే సుందర ఘట్టం వీక్షించేందుకు రెండు కళ్ళు సరిపోవు. అంత వైభవోపేతంగా ప్రభల ఉత్సవం కోనసీమలో కొనసాగుతుంది. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో నిర్వహించే ప్రభల తీర్థం కోనసీమలో అతిపెద్దది. ఈ తీర్థంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వీరభద్రుడిని కొలుస్తూ శరభ శరభ అంటూ కనుమ రోజు ప్రభలను తీర్థ ప్రదేశాలకు తీసుకెళతారు.

ఇదీ చదవండి:

ఉదయం నుంచే కోడి పందేలు షురూ.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.