ETV Bharat / state

నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు: ఎస్పీ

author img

By

Published : Jun 4, 2019, 4:26 PM IST

sp

ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలన అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ పోలీసు సిబ్బందికి సూచించారు.

ప్రజలకు పారదర్శకతతో కూడిన పాలన అందించాలి:ఎస్పీ

కాకినాడలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజలకు అందించాల్సిన మెరుగైన పాలనపై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సమీక్ష నిర్వహించారు. గతవారం సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో జరిగిన సమీక్ష వివరాలు జిల్లా పోలీసు యంత్రాంగానికి వివరించారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, బాలలకు సంబంధించిన ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. జిల్లాలో మద్యం గొలుసు దుకాణాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్ కు వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారికి న్యాయం అందేలా చూడాలని సూచించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.

Intro:ap_vja_27_03_iiit_lo_skills_traing_avb_c5. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీ లో ప్రారంభమైన అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఈ కార్యక్రమంలో ఆర్ జె కే యూ టీ ప్రాంగణాల ఉపకులపతి ఆచార్య వి రామచంద్రరాజు ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దమయంతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ జె ఎస్ వి ప్రసాద్ గారు మొదల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కి నూజువీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు గారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ కరించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నూజివీడు ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు కు కృతజ్ఞతలు తెలిపారు నెల రోజుల పాటు ఉ జరిగే ఈ అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాల శిక్షణ కార్యక్రమంలో 210 మంది ఏపీ ఎస్ ఎస్ డి సి ట్రైనీలు 31 మంది ఆర్ జే కే యూ టీ నూజివీడు విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు ఈ శిక్షణా తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ అయినా శ్రీ జె ఎస్ వి ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రతి చదువుకున్న వ్యక్తి చైతన్యవంతంగా జీవచ్ఛవాల తో సమానమని వారిది ఎరుక లేని జీవితం అవుతుందని ఉన్నతమైన జీవితం కోసం చదువుకునే వాళ్ళందరూ కోరుకోవాలి అలానే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సార్థకం అవ్వాలంటే ప్రతి విద్యార్థి నాలెడ్జ్ skills యాటిట్యూడ్ మార్పులు తెచ్చుకోవాలని తెలిపారు. బైట్స్. 1) జె ఎస్ వి ప్రసాద్. ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ అధికారి. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజువీడు త్రిబుల్ ఐటీ లో ప్రారంభించిన అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలు పై శిక్షణ


Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రారంభించిన అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.