తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు డీసీసీబీ విశ్రాంత ఉద్యోగి నరసింహ మూర్తి అరెస్ట్పై డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకొనే సమయంలో 'స్టే ఆర్డర్' చూపించలేదని తెలిపారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో సిబ్బందితో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు.
లంపకలోవ సొసైటీ నిధుల దుర్వినియోగం కేసులో ఇతర నిందితులు న్యాయస్థానం ఉత్తర్వులు చూపించడంతో.. వారిని అరెస్ట్ చేయలేదన్నారు. 'స్టే ఆర్డర్' ఉన్న తన భర్తను ప్రత్తిపాడు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. నరసింహ మూర్తి భార్య రమణమ్మ మీడియాను ఆశ్రయించారు. ఇది జరిగిన 4 గంటల్లోనే.. డీఎస్పీ సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.
ఇదీ చదవండి: