గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 80 కిలోల గంజాయి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.
ముందుస్తు సమాచారం మేరకు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి నిందితులను పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. గంజాయి విలువ రూ. 1.75 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు.
ఇదీ చదవండి: