ETV Bharat / state

గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు

author img

By

Published : Oct 29, 2020, 9:32 PM IST

80 కిలోల గంజాయిని రెండు ద్విచక్రవాహనాల్లో తీసుకెళ్తున్న నలుగురిని మారేడుమిల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 1.75 లక్షలు ఉంటుందని ఏఎస్పీ మాధవ్​ తెలిపారు.

ganjai caught by maridimalli police
80 కిలోల గంజాయి పట్టుకున్నమారేడుమిల్లి పోలీసులు

గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 80 కిలోల గంజాయి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్​ తెలిపారు.

ముందుస్తు సమాచారం మేరకు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి నిందితులను పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. గంజాయి విలువ రూ. 1.75 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు.

ఇదీ చదవండి:

పొట్టిపాడు టోల్​గేట్ వద్ద గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.