ETV Bharat / state

శాంతించిన గోదారమ్మ... ముంపు నుంచి బయటపడిన కాజ్​వే

author img

By

Published : Jul 28, 2021, 11:59 AM IST

causeway_mumpu_remove
ముంపు నుంచి బయటపడిన కాజ్వే

గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం సమీపంలోని కాజ్​వే గోదావరి వరద ముంపు నుంచి బయటపడింది. నాలుగు రోజుల అనంతరం కాజ్​వేకు అవతల వైపున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు చాకలి పాలెం వైపు రావడానికి మార్గం సుగమం అయ్యింది.

నాలుగు రోజుల క్రితం గోదావరి వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం సమీపంలోని కాజ్​వే మునిగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు తూర్పుగోదావరి జిల్లా చాకలి పాలెం వైపు రావడానికి చాల ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో రెండు గ్రామల మద్య మళ్ళి రాకపోకలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ఉన్న కాజ్​వే శిధిలావస్థకు చేరుకుందని కొత్త కాజ్​వేను ఎత్తుగా నిర్మించాలని లంక గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.