ETV Bharat / state

పేరుకు అమ్మాయే.. మగరాయుడిలా వేషభాష

author img

By

Published : Dec 9, 2022, 10:53 AM IST

పెళ్లి చేసుకోమని కోరినందుకు ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటనలో ప్రియురాలు లక్ష్మీ సౌమ్యకు బెయిల్‌ మంజూరైంది. అయితే నిందితురాలు లక్ష్మీ పేరుకు అమ్మాయే అయినా.. మగరాయుడిలా కనిపించేదని.. ఆమె వేషధారణ, భాష అంతా విభిన్నంగా ఉండేదని పోలీసుల విచారణలో తేలింది. స్థానికులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పేరుకు అమ్మాయే.. మగరాయుడిలా వేషభాష
పేరుకు అమ్మాయే.. మగరాయుడిలా వేషభాష

స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ) భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. ఆయన కుమార్తె లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తి చేసింది. ఈమెకు తండ్రితో విభేదాలు రావడంతో 6 నెలల క్రితం నగరానికి వచ్చేసింది. క్రికెట్‌ కోచింగ్‌తో పాటు ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం వచ్చానంటూ కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని శ్రీ తనూజ హాస్టల్‌లో చేరింది.

....

సాధారణంగా రాత్రి 10 గంటలకు హాస్టల్‌ గేట్లు మూసేస్తారు. కానీ లక్ష్మీ సౌమ్య మాత్రం నిత్యం ఆలస్యంగా చేరుకునేది. దీంతో ఆమె ప్రవర్తన నచ్చక హాస్టల్‌ నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించగా.. తొమ్మిదో ఫేజ్‌లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటోంది. పేరుకు అమ్మాయే అయినా మగరాయుడిలా కనిపించేది. ఆమె వేషధారణ, భాష అంతా విభిన్నంగా ఉండేది. ఈమె హాస్టల్‌లో ఉన్నప్పుడు అక్కడికి సమీపంలోనే ఉన్న దేవీ లగ్జరీ బాయ్స్‌ హాస్టల్‌లో గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్‌కుమార్‌ (27) 7 నెలలుగా ఉంటూ ఎస్‌ఏపీ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఇతని సోదరి కూడా సమీపంలోని హాస్టల్‌లోనే ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. అశోక్‌కుమార్‌, లక్ష్మీ సౌమ్య నిత్యం ఓ టీ స్టాల్‌కు వెళ్లేవారు. అక్కడ పరిచయం ఏర్పడి రోజూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్లు.

ఈ క్రమంలో లక్ష్మీ సౌమ్యకు అవసరమై.. అప్పుడప్పుడు అశోక్‌కుమార్‌ కొంత నగదు ఇచ్చాడు. అలా చనువు కొద్దీ ఆమెతో పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. ఆమె మౌనం వహించేది. ఈ నెల 5న అశోక్‌కుమార్‌ పుట్టినరోజు ఉండటంతో ఖర్చులకు తానిచ్చిన డబ్బులు ఇవ్వమని లక్ష్మీ సౌమ్యని అడిగాడు. దానిపై మాటమాట పెరిగి డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అశోక్‌ అనడంతో లక్ష్మీ సౌమ్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన వద్ద ఉన్న చాకు లాంటి మినీ కట్టర్‌తో అశోక్‌కుమార్‌పై దాడి చేసింది. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ముఖానికి సంబంధించిన నరం తెగిందని, ముఖం ఎడమ వైపు పక్షవాతం వచ్చిందని, రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ అవుతాడని వైద్యులు తెలిపారు.

పరిస్థితులే కారణం..: తరచూ పెళ్లి ప్రస్తావన తేవడంతో పాటు గొడవ పడేవాడని, వద్దని వారిస్తున్నా వినలేదని, సహనం నశించి దాడి చేశానని, తాను ఇలా తయారవడానికి పరిస్థితులే కారణమని లక్ష్మీ సౌమ్య పోలీసుల దర్యాప్తులో చెప్పినట్లు తెలిసింది. గురువారం పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌ మంజూరైంది.

ఇవీ చూడండి..

పెళ్లి చేసుకోమని అడిగినందుకు గొంతు కోసిన ప్రియురాలు.. ఎక్కడంటే?

కంట్లో కారం కొట్టి.. బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.