ETV Bharat / state

Sand Sculpture of Lord Shiva: రంగంపేటలో శివపార్వతుల సైకతశిల్పం..

author img

By

Published : Feb 28, 2022, 9:01 PM IST

Sand Sculpture of Lord Shiva on at Rangampet: మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ సైకతశిల్పి దేవిన శ్రీనివాస్.. శివపార్వతుల సైకత శిల్పాన్ని రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని ఈ శిల్పాన్ని చూసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు.

carves Lord Shiva at rangampeta
శివ పార్వతుల సైకత శిల్పం

Sand Sculpture of Lord Shiva on Maha Shivratri 2022: మహాశివరాత్రిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో శివపార్వతుల సైకత శిల్పం రూపుదిద్దుకుంది. రంగంపేటకు చెందిన ప్రముఖ సైకతశిల్పి దేవిన శ్రీనివాస్.. 15 గంటలపాటు శ్రమించి శివపార్వతుల సైకత శిల్పాన్ని రూపొందించారు. 'శివతత్వం తెలుసుకో... నిన్ను నీవు దిద్దుకో'... అన్న నినాదంతో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ శివలింగాలను తీర్చిదిద్దారు. ఐదు యూనిట్ల ఇసుక ఉపయోగించి 20 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుతో చేసిన ఈ సైకత శిల్పాన్ని చూసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి:

కోటొక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడట.. అదే వారి నమ్మకమట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.