రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన వడ్లమూరు, కాలేరు, అచ్యుతాపురం గ్రామాల్లో సచివాలయాలు ప్రారంభించారు. పేద ప్రజలకు అన్ని పథకాలు సకాలంలో అందేలా గ్రామ వలంటీర్లు నియమించామన్నారు. వారి ద్వారా నవరత్నాలు ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ రూ.13,500 మూడు దఫాలుగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: