ETV Bharat / state

నిలిచిపోయిన షూటింగ్.. తిరిగొచ్చిన 'పుష్ప'

author img

By

Published : Dec 3, 2020, 6:00 AM IST

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఈ సినిమా చిత్రీకరణ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. యాక్షన్ ఘట్టాల్ని, ఓ పాటని తెరకెక్కించారు. కానీ అర్థాంతరంగా చిత్రబృందం ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్​కు వెళ్లిపోయారు. కరోనా కారణంగానే చిత్రీకరణ నిలిచిపోయినట్లు సమాచారం.

Allu arjun pushpa
Allu arjun pushpa

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతున్న పుష్ప సినిమా షూటింగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్​గా నటిస్తున్న పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా మారేడుమిల్లి మండలం చావిడి కోట పంచాయతీ ఉప్పరి గోతుల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.

రామ్​ లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రెండు యాక్షన్ ఘట్టాల్ని, ఓ పాటని తెరకెక్కించారు. మరికొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉండగా ప్యాకప్ చెప్పేసి చిత్రబృందం హైదరాబాద్​కు తిరిగి వెళ్లింది. కరోనా భయాలతోనే తాత్కాలికంగా చిత్రీకరణ నిలిపివేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి : 'గ్యాంగ్స్​ ఆఫ్​ వాసేపుర్​'​ నటుడిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.