ETV Bharat / state

YS Jagan: చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నాన్ రెసిడెంట్ లీడర్స్: సీఎం జగన్

author img

By

Published : Jul 4, 2023, 10:09 PM IST

‌‍Chittoor Cooperative Dairy: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేసిన జగన్‌.... 385 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ ముందుకొచ్చినట్లు వెల్లడించారు. సొంత డెయిరీ మేలు కోసం... చిత్తూరు డెయిరీని పథకం ప్రకారం, కుట్రతో.. చంద్రబాబు నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. ఇదే సభలో విపక్షాలపై మరోసారి సీఎం విమర్శలు ఎక్కుపెట్టారు.

Etv Bharat
Etv Bharat

YS Jagan allegatons on Chandrababu Naidu: చంద్రబాబు పాలనలో ప్రభుత్వరంగ, సహకార రంగంలో 54 పరిశ్రమలను మూతవేయడం, విక్రయించడం ద్వారా కార్మికులను, రైతులను రోడ్డున పడేస్తే...తాము అధికారంలోకి వచ్చాక సహకార రంగ అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. పాల ఉత్పత్తిదారు సంస్థ అమూల్‌ సహకారంతో 387 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అమూల్‌ చిత్తూరు డైరీ నిర్మాణానికి భూమిపూజ, చిత్తూరు నగరశివారలో మూడువందల పడకలతో నిర్మించనున్న సీఎంసీ ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేశారు. అమూల్‌ చిత్తూరు డైరీ పునరుద్ధరణ ద్వారా రెండు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.రెండు వేల మందికి ప్రత్యక్షంగా 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 20 ఏళ్లుగా మూతబడిన చిత్తూరు డెయిరీ బకాయిలు 182 కోట్ల రూపాయలను తీర్చడంతో పాటు అమూల్‌ సంస్ధతో ఒప్పందం చేసుకుని 385 కోట్ల రూపాయల పెట్టబడితో డైరీ పునరుద్ధణకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. చిత్తూరు నగర్‌ శివారులో డైరీ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చిత్తూరు డెయిరీని 2002లో కుట్రపూర్వకంగా మూసేశారని.. 2.50లక్షల నుంచి 3లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేస్తున్న డైరీని ఒక పథకం ప్రకారం కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. డైరీ మూసేయడంతో రైతులకు, ఉద్యోగులకు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని జగన్ విమర్శించారు.

పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డెయిరీకి సంబంధించిన 182 కోట్ల రూపాయల బకాయిలు తీర్చడంతో పాటు 385 కోట్ల రూపాయల పెట్టుబడితో డెయిరీని తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. సహకార రంగంలో లాభాలను ప్రతి ఆరు నెలలకోసారి బోనస్‌ఇచ్చి.. పాలు పోస్తున్న రైతులకు లాభాలు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టామని జగన్ వెల్లడించారు. ప్రభుత్వ చర్యలతో పాడి రైతులకు 4,243 కోట్ల రూపాయల అదనపులబ్ధి చేకూరిందన్నారు. దేశంలోనే అగ్రగామి సీఎంసీ వైద్యకళాశాల చిత్తూరుకు వస్తుంటే సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు అడ్డుకొన్నారని ఆరోపించారు. స్థలాలివ్వకుండా మంచి వైద్యకళాశాల రాకుండా అడ్డుకున్న చరిత్ర వారిదన్నారు. రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వ, సహకార రంగంలోని చక్కెర, నూలు ఫ్యాక్టరీలు, డెయిరీలు, పేపర్‌ మిల్స్, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను నష్టాల్లోకి నెట్టేసి తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్మేశారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ముడుపులు కోసం ప్రభుత్వ, సహకార రంగ సంస్ధలన్నింటినీ అమ్మేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉందని జగన్ విమర్శించారు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు లెక్కలేనన్ని అన్యాయాలు చేశారని.. ఒక్క మేలు చేయలేదని విమర్శలు గుప్పించారు.

Dhulipalla Narendra: ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్​ను తీసుకువచ్చారు: ధూళిపాళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.