ETV Bharat / state

యువకుడిని కొట్టారని పోలీసులతో కుటుంబసభ్యుల వాగ్వాదం

author img

By

Published : Jul 27, 2020, 11:17 PM IST

young person parents fight with police in tirupathi
బాధిత యువకుడు

యువకుడిని కొట్టారంటూ పోలీసులతో అతని కుటుంబసభ్యులు వాగ్వాదం పెట్టుకున్న ఘటన తిరుపతి ఎస్టీవీ నగర్​లో జరిగింది. బైక్ ఆపనందుకు పోలీసులు చేయి చేసుకున్నారని వారు ఆరోపించారు.

తిరుపతిలో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణంలోని ఎస్టీవీ నగర్​కు చెందిన జయచంద్ర అనే యువకుడిని పోలీసులు కొట్టారంటూ అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బైక్ ఆపమంటే ఆపలేదనే కారణంతో యువకుడిని కొట్టారంటూ వారు ఆరోపించారు. దీనిపై తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్​ను వివరణ కోరగా.. రాత్రివేళ కర్ఫ్యూ ఉన్న కారణంగా బైక్​పై వెళుతున్న జయచంద్రను ఆపే ప్రయత్నంలో కానిస్టేబుల్ లాఠీ తగిలి గాయమైందని వివరించారు.

ఇవీ చదవండి..

వారమైనా రాని అంబులెన్స్... గాల్లో కలిసిన కరోనా బాధితురాలి ప్రాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.