ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Jan 9, 2021, 11:11 AM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.

vip at darshan
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపె విశ్వరూప్‌, నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్ణాటక మంత్రి నగేష్‌, కర్ణాటక ఎమ్మెల్యే రేవన్న, ఆర్బీఐ సీజీఎం నిఖిలా దర్శించుకున్నారు.

వారికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం ముందుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించాలని స్వామిని ప్రార్థించినట్లు మంత్రి విశ్వరూప్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

కిడ్నీలు పాడైన బాధితుడికి వైకాపా సోషల్ మీడియా సహాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.