ETV Bharat / state

venkaiah naidu in tirumala: పెళ్లి వేడుకలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య

author img

By

Published : Feb 9, 2022, 3:59 PM IST

venkaiah naidu in tirumala: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల చేరుకున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. అనంతరం తన మనవరాలి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

vice president venkaiah nayudu in turumala
vice president venkaiah nayudu in turumala

venkaiah naidu in tirumala: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్వాగతం పలికారు. రేణిగుంట నుంచి యోగిమల్లవరం సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ హాలుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు.. అక్కడ వారి మనవరాలి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం.. తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న వారికి తితిదే ఈవో జవహర్ రెడ్డి, అధికారులు ఘన స్వాగతం పలికారు.

రాత్రికి తిరుమలలో బస చేసి, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పుష్పగిరి మఠంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట చేరుకొని.. అక్కడి నుంచి దిల్లీకి వెళ్తారు.

ఇదీ చదవండి: Lokesh fires on CM Jagan: అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే.. జగన్​లానే ఉంటుంది : లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.