ETV Bharat / state

వచ్చే ఏడాది దసరాకు తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రి : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

author img

By

Published : Dec 24, 2022, 1:42 PM IST

doctor nori dattatreyudu
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

Cancer Hospital in Tirupati: స్విమ్స్​కు అనుబంధంగా తిరుపతిలో శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది దసరాకు దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో అన్ని క్యాన్సర్​లకు వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు.

Cancer Hospital in Tirupati: దేశంలోనే క్యాన్సర్‌కు అత్యుత్తమ చికిత్స అందించేలా తిరుపతిలో శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్విమ్స్​కు అనుబంధంగా ఇది ఏర్పాటవుతుందన్నారు. ఆసుపత్రి ప్రగతిపై వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది దసరాకు దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో అన్ని క్యాన్సర్​లకు వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు. క్యాన్సర్​పై అవగాహన కల్పించడంతో పాటు త్వరగా గుర్తించడానికి క్యాన్సర్‍ అట్లాస్‍ పేరుతో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఆసుపత్రి ప్రగతిపై వైద్యులు, అధికారులతో సమీక్ష

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.