ETV Bharat / state

వీలైనంత త్వరగా వ్యాక్సిన్​లు పంపించండి.. కేంద్రాన్ని కోరిన విడదల రజని

author img

By

Published : Dec 24, 2022, 9:53 AM IST

Vidadala Rajini Video Conference: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయాతో వీడియో కాన్ఫెరెన్స్​లో పాల్గొన్నారు. రాష్ట్రానికి వ్యాక్సిన్‌లు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

rajini
మంత్రి విడదల రజని

Vidadala Rajini Video Conference: రాష్ట్రానికి అత్యవసరంగా కొవిడ్‌ టీకాలు పంపాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి చర్యలపై కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్​లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 47వేల కొవిడ్ టీకాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని.. రెండు మూడ్రోజుల్లో అవీ అయిపోతాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌లు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు వివరించారు.

కేంద్రమంత్రితో వీడియో కాన్ఫెరెన్స్​లో పాల్గొన్న విడదల రజని

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.