ETV Bharat / state

'లాక్​డౌన్ ముగిశాకే శ్రీవారి దర్శనంపై నిర్ణయం'

author img

By

Published : Apr 30, 2020, 8:57 AM IST

తిరుమలలో నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ వెల్లడించారు. కరోనా దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనాల విషయంపై మే 3 తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

tirumala padmavati marriage celebrations postponed due to corona virus problems
గురువారం ఏకాంత సేవ అనంతరం విషయాన్ని తెలిపిన తితిదే ఈవో

లాక్​డౌన్​పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తీసుకున్న తర్వాత... అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు. గురువారం రాత్రి ఏకాంత సేవ అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. కరోనా దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆగమ సలహామండలి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారికి ఆగమోక్తంగా అన్ని సేవలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించే విషయమై లాక్​డౌన్ ముగిసిన తరువాత ప్రకటిస్తామన్నారు. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం భక్తుల సమక్షంలో నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహిస్తామన్నారు.

ఇదీ చదవండి :

తిరుమల కొండపై దట్టమైన మంచు తెరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.