ETV Bharat / state

రూ.177 కోట్లతో తిరుపతి ఎయిర్​పోర్ట్ రన్​వే విస్తరణ

author img

By

Published : Nov 27, 2019, 11:29 PM IST

tirupathi run way
tirupathi run way

తిరుపతి విమానాశ్రయంలో రన్​వే విస్తరణ పనులు చేపట్టారు. 2021 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

భారీ విమానాల రాకపోకలకు వీలుగా... తిరుపతి విమానాశ్రయంలో రన్​వే విస్తరణ పనులను చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. రూ.177 కోట్లోత తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేను విస్తరించి, పటిష్ఠపరిచే పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు... కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రన్‌ వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రన్‌ వే విస్తరణ కోసం ఇంకా 30 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించాలన్నారు. ఇప్పటికే స్వాధీనం చేసిన భూమిలో ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల తొలగింపులో జరుగుతున్న జాప్యం కారణంగానే పనులు మందగించాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఉద్యోగాల భర్తీ, పదవీ విరమణపై కేంద్రం కీలక ప్రకటన

File Name: AP_HYD_Del_07_27_TIRUPATHI_RUN_WAY_RS_DRY_AV_3181995 Slug: Reporter: విద్యా సాగర్ Cam: ( ) భారీ విమానాల రాకపోకలకు వీలుగా తిరుపతి విమానాశ్రయంలో రన్ వే విస్తరణ పనులను చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. 177 కోట్ల రూపాయలతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే ను విస్తరించి, పటిష్టపరిచే పనులను చేపట్టినట్లు రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రన్‌ వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తి కాగలవని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రన్‌ వే విస్తరణ కోసం ఇంకా 30 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకి అప్పగించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే స్వాధీనం చేసిన భూమిలో ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల తొలగింపులో జరుగుతున్న జాప్యం వల్లనే పనులు మందగించాయని పేర్కొన్నారు. VIS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.