ETV Bharat / state

17వ రోజు యువగళం పాదయాత్ర.. అన్ని వర్గాల సమస్యలు పరిష్కారిస్తామని లోకేశ్​ హామి

author img

By

Published : Feb 13, 2023, 10:26 AM IST

Nara Lokesh : ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. అరాచ‌క వైఎస్సార్​సీపీ పాల‌న‌పై పోరాటం ఆగదని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 17వ రోజు పాదయాత్ర కొనసాగించారు. కార్మికులు, కర్షకులు, మహిళలు, యువతను పలకరిస్తూ ముందుకు సాగారు. అన్నివర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Nara Lokesh
నారా లోకేశ్​

17వ రోజు యువగళం పాదయాత్ర

Nara Lokesh Yuvagalam Padayatra : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర.. 17వ రోజున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కొత్తూరు నుంచి నగరి నియోజకవర్గం చినరాజకుప్పం వరకు 17.7 కిలోమీటర్ల మేర సాగింది. దారి పొడవునా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, సమస్యల్ని ఆరా తీస్తూ ముందుకు సాగిన లోకేశ్‌.. గౌడ, మైనారిటీల వర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే పన్నులు తగ్గించి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు.

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సొంతూరు డీఎం పురంలో లోకేశ్‌కు స్థానికులు హారతులు, గజమాలలతో స్వాగతం పలికారు. గ్రామ సమస్యలను వివరించారు.

"స్టూల్​ తీసేస్తే ఇల్లు ఎక్కి మాట్లడుతా. అది కాకపోతే మా నాయకుల భుజలపై ఉండి మాట్లడుతా. చైతన్యం తీసుకువస్తున్నాను కాబట్టే అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినా పర్వాలేదు పోరాడుతా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు పెరగలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. ఉద్యోగాలు వచ్చాయి." -నారా లోకేశ్​, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి

సీఎం జగన్ వ్యవస్థలంటినీ ధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేసి వైఎస్సార్​సీపీ సర్కార్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. 18 వ రోజున చినరాజకుప్పం నుంచి యాత్ర ప్రారంభించనున్న లోకేశ్‌.. పుత్తూరు బహిరంగసభలో పాల్గొననున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.