ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

author img

By

Published : Aug 30, 2020, 10:30 AM IST

Updated : Aug 30, 2020, 12:03 PM IST

road accident at Palamaneru National Highway in Chittoor district
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

10:28 August 30

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమాకులపల్లె వద్ద 3 వాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనగా... ఆ లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో కారులో వెళ్తున్న ముగ్గురు, ద్విచక్రవాహనదారుడు మృతి చెందారు. కారులోని వ్యక్తులు బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు బంగారుపాళ్యంకు చెందిన బాబుగా.... మిగతా ముగ్గురు మృతులు.. వెంకటేశ్వరరెడ్డి (29), రత్నమ్మ (49), శ్రీనివాసులురెడ్డి (55)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఇంటి అద్దె కట్టలేక కన్నబిడ్డను అమ్మిన తల్లి!

Last Updated :Aug 30, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.