ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన పలువురు అధికారులు

author img

By

Published : Dec 25, 2020, 5:30 PM IST

vaikuntha Ekadashi at Srikalahasti
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన పలువురు అధికారులు

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. వాళ్లకు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తికి చేరుకున్న అధికారులు.. శ్యామ్ షేర్ సింగ్ రావత్, కార్తికేయ మిశ్రా, రవి సుభాశ్, డా కె వి వి సత్యనారాయణకు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు దర్శినానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదం, జ్ఞాపికను ఈవో అందజేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.