చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మీదకు రావడానికి ప్రయత్నించిన ఏనుగులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం సాయంత్రం మూడు ఏనుగులు నాలుగో నెంబర్ జాతీయ రహదారిపైకి రావడానికి ప్రయత్నించాయి. వాటిని అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకొని అడవిలోకి మళ్లించారు. రెండు ఏనుగులు మాత్రం అడవిలోకి వెళ్లగా ఒంటరి ఏనుగు రోడ్డు పక్కనే తిరుగుతూ కనిపించింది.
ఇదీ చూడండి:టైరు పేలి లారీ బోల్తా... ఒకరు మృతి