చిత్తూరు జిల్లా వెంకటగిరికోట పోలీసులు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని రేణిగుంట నుంచి కారులో గంజాయిని తమిళనాడుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండల కేంద్రంలోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. గంజాయి తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణహత్య