ETV Bharat / state

వీ.కోటలో 60 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురిపై కేసు నమోదు

author img

By

Published : Jan 20, 2021, 2:47 PM IST

వీ.కోటలో 60 కిలోల గంజాయి స్వాధీనం
వీ.కోటలో 60 కిలోల గంజాయి స్వాధీనం

తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని చిత్తూరు జిల్లా వెంకటగిరికోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లా వెంకటగిరికోట పోలీసులు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని రేణిగుంట నుంచి కారులో గంజాయిని తమిళనాడుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండల కేంద్రంలోని చెక్​ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. గంజాయి తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.