చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలాల పట్టాల వివరాల నమోదు కోసం జనం సామాజిక దూరం విస్మరించి ఎగబడ్డారు. ఈ పరిస్థితిని పట్టించుకోని అధికారుల తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మండల సచివాలయం వద్ద వందల సంఖ్యలో లబ్ధిదారులు గుమిగూడారు. కనీస దూరం విస్మరించినందున కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: