చిత్తూరు జిల్లా శేషాచల అటవీప్రాంతంలోని తలకోన సెంట్రల్ బీట్ పరిధిలో గల ఉట్లదింపదడి, నెలకోన, నక్కలవంక, బొబ్బిలిరాజు మిట్ట ప్రాంతాల్లో మంటలు చేలరేగాయి. ఉదయం నుంచి స్ట్రకింగ్ ఫోర్, బ్యేస్ క్యాంపు, సీబీటీ, ఫారెస్ట్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పశువుల కాపరులు నిప్పు పెట్టి ఉంటారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రగిరి కోట సమీపంలోని కొండలు, కొటాల ప్రాంతాల్లో కూడా మంటలు చేలరేగగా.. ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు ఇలాగే కొనసాగితే శేషాచలంలోని అరుదైన జంతు సంపదను, విలువైన ఎర్రచందనం చెట్లు కాలి బూడిదయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. సమీప ప్రాంతంలోని పంటపొలాలు కాలి బుడదయ్యే అవకాశం ఉందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి