ETV Bharat / state

Express Way: దక్షిణాదిలో తొలి ఎక్స్‌ప్రెస్‌వే.. పూర్తయితే బహుళ ప్రయోజనాలు

author img

By

Published : May 26, 2022, 7:56 AM IST

Express Way: దక్షిణ భారతదేశంలో తొలి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా పలు రాష్ట్రాలతో పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పనులు జిల్లాలో జూన్​లో మొదలు కానున్నాయి.

Express Way in chittor
దక్షిణాదిలో తొలి ఎక్స్‌ప్రెస్‌వే

Express Way: దక్షిణ భారతదేశంలో తొలి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా కర్ణాటకలోని కోలార్‌, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, తిరువళ్లూర్‌, ఏపీలోని చిత్తూరు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 26న బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రహదారి (ఎన్‌ఈ-7) నిర్మాణానికి ప్రధాని మోదీ చెన్నైలో శంకుస్థాపన చేయనున్నారు.

కర్ణాటకలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలో జూన్‌లో మొదలు కానున్నాయి. ఈ రహదారి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) లక్ష్యంగా పెట్టుకుంది.

4-6 మీటర్ల ఎత్తులో ప్రయాణం.. 4 వరుసల్లో ఉండే ఈ రోడ్డు కర్ణాటకలోని హొస్‌కోటలో ప్రారంభమై.. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నెర్నిపల్లి మీదుగా వస్తుంది. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ వద్ద రహదారి ముగుస్తుంది. భవిష్యత్తులో రహదారిని 8 వరుసలకు విస్తరించేలా నిర్మిస్తున్నారు. గంటకు 120 కి.మీ.మేర వాహనాలు ప్రయాణించేలా రూపొందించారు.

భూఉపరితలం నుంచి 4-6 మీటర్ల ఎత్తులో ప్రయాణం సాగనుంది. తద్వారా వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండదు. చిత్తూరు జిల్లాలో 1,594.72 ఎకరాల ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 80 శాతం సేకరించారు.

రహదారి వెంట గిడ్డంగులు, వాహనాల పరిశ్రమలు.. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవా (సీబీఐసీ) సమీపం నుంచే ఎక్స్‌ప్రెస్‌ వే వెళుతుంది. ఈ రహదారి వెంట గిడ్డంగులు, వాహన పరిశ్రమలు విరివిగా ఏర్పడి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ చిత్తూరు ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రశాంత్‌ తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చే సరకు రవాణా వాహనాలు త్వరగా చెన్నై నౌకాశ్రయానికి చేరతాయి.

Express Way in chittor
దక్షిణాదిలో తొలి ఎక్స్‌ప్రెస్‌వే

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.