ETV Bharat / state

జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాసిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

author img

By

Published : May 14, 2021, 7:49 PM IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక ముప్పై మంది మరణించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపి.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్​హెచ్​ఆర్​సీని కోరారు.

ex minister chinta mohan
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

తిరుపతి రుయా ఆస్పతిలో జరిగిన విషాద ఘటనపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాశాడు. ఈ నెల పదవ తేదీన ఆక్సిజన్​ సరఫరా నిలిచిపోవటంతో 30మంది ప్రాణాలు కోల్పోయారని… కేవలం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన మానవ హక్కులను కాలరాసిందని ఆక్షేపించారు. ఎన్​హెచ్​ఆర్​సీ.. స్వయంగా విచారణ జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నీటికి కటకట.. ట్యాంకర్లు తగ్గి కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.