ETV Bharat / state

kuppam elections: ఎన్నికల వేళ కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

author img

By

Published : Nov 14, 2021, 10:37 PM IST

సోమవారం ఎన్నిక జరగనున్నవేళ కుప్పం మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు(Clashes between tdp and ycp activists in Kuppam) తలెత్తాయి. అధికార పార్టీ అభ్యర్థుల తరపున కొంతమంది డబ్బులు పంచుతున్నారంటూ తెలుగుదేశం ఆందోళనకు దిగింది. వైకాపా నాయకుల తొత్తుల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది.

conflict between tdp and ycp activists in Kuppam
ఎన్నికల వేళ కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు

ఎన్నికల వేళ కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ (Clashes between tdp and ycp activists in Kuppam) తలెత్తింది. వైకాపా అభ్యర్థుల తరపున ఇతర ప్రాంత వాసులు డబ్బులు పంచుతున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి చేయబోయారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. తెదేపా పురపాలిక అధ్యక్షుడు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట..
కుప్పం వస్తున్న మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, తెదేపా నేత పులివర్తి నానిని పోలీసులు ఆపేశారు. వారిని వ్యానులోకి ఎక్కించేందుకు యత్నించగా... తెలుగుదేశం కార్యకర్తలు(tdp activist ) అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కుప్పం ఎన్నికల్లో వైకాపా ఓడితే జగన్‌ సీఎం పదవి పోతుందా అని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఆగ్రహించారు. మెప్మా, వెలుగు, ఇతర ఉద్యోగులకు ఇంకా కుప్పంలో పనేంటని ధ్వజమెత్తారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం.. అనైతికం, అప్రజాస్వామికమం

పురపాలక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకొని వేధించడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandrababu on police over action at kuppam) ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో నోట్ల కట్టలు పంచుతూ పట్టుబడ్డ వైకాపా నేతల(ycp)ను అదుపులోకి తీసుకోకుండా తెలుగుదేశం శ్రేణులను పోలీసులు బెదిరించడం అనైతికం, అప్రజాస్వామికమని చంద్రబాబు( chandrababu fire on ycp activities at kuppam municipality ) ధ్వజమెత్తారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారిని అడ్డుకోవడంపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.


నివేదిక పంపండి

కుప్పంలో వాలంటీర్ల దుర్వినియోగం, బోగస్‌ ఓట్ల కోసం బయటి వ్యక్తుల సమీకరణ, ఓటర్లకు డబ్బు పంపిణీ తదితర అంశాలపై తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. కుప్పంలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక వార్డులన్నింటిలో అదనపు పోలీసు బలగాలు మోహరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్​కు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ స్టేషన్‌లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైవ్ వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ రికార్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అవసరమైన చర్యలు తీసుకుని ఎస్​ఈసీ(sec on Clashes between tdp and ycp activists at kuppam)కి నివేదిక పంపాలని ఆదేశించారు.

ఇదీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.