ETV Bharat / state

దురంతో ఎక్స్​ప్రెస్​లో స్వల్ప మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

author img

By

Published : Nov 27, 2022, 3:54 PM IST

Duranto Express catches fire in AP: బెంగళూరు నుంటి హవ్​డా వెళ్తున్న దురంతో ఎక్స్​ప్రెస్​లో స్వల్ప మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకుని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కుప్పంలో రైలు నిలిపివేయగానే రైలు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

Duranto Express catches fire
Duranto Express catches fire


Duranto Express catches fire: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్పంగా మంటలు రావడం కలకలం సృష్టించింది. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్​లో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హవ్​డా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్​లోని ఎస్-9 బోగీలో ఒక్కసారిగా స్వల్ప మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును కుప్పం రైల్వేస్టేషన్​లో ఆపారు. విషయం తెలుసుకుని ప్రయాణికులు రైలు దిగి.. పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించి.. చర్యలు చేపట్టి మంటలార్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలార్పిన అనంతరం ట్రైన్ బయలుదేరింది. ఈ ఘటనలో ఎలాంటి అపాయం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

దురంతో ఎక్స్​ప్రెస్​లో స్వల్ప మంటలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.