డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
By
Published : Feb 15, 2020, 1:07 PM IST
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 10కోట్ల వ్యయంతో డ్రైనేజీ పనులు చేపట్టారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో అధునాతన పద్ధతిలో పటిష్టంగా నిర్మించేందుకు పనులు మొదలుపెట్టినట్లు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఆరు మండలాలకు గానూ.. పెద్దతిప్ప సముద్రం, తంబళ్లపల్లె మండలాల్లో ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు.