ETV Bharat / state

ఎమ్మార్వో కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

author img

By

Published : Nov 6, 2019, 6:08 PM IST

ఎమ్మార్వో కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భూమికి వేరొకరి పేరుతో పట్టా ఇచ్చారన్న మనస్తాపంతో రైతు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉరేసుకునేందుకు యత్నించారు.

ఎమ్మార్వో కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..!
చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్ కార్యాలయ గేటు వద్ద ఓ రైతు కుటుంబం.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. జిల్లాలో తగరాలతాండ గ్రామానికి చెందిన బాబు నాయక్... తన భూసమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో.. రామకుప్పం తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబం సభ్యులతో కలిసి ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. తన పేరిట ఉన్న భూమిని వేరొకరి పట్టా ఇచ్చారని బాబూనాయక్​ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం... కార్యాలయం ముందు నిరసన తెలిపింది.

ఇదీ చదవండి :

రైతు భరోసా రానందుకు అధికారులపై పెట్రోలు

Intro:Ap_tpt_81_06_raitu_atmahatyayatnam_avb_ap10009
తహసీల్దార్ కార్యాలయం లో రైతు కుటుంబం ఆత్మహత్యా యత్నం

చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం లో రైతు కుటుంబం ఆత్మ హత్యా యత్నం కు పాల్పడటం సంఘటన కలకలం రేపింది
తగరాల తాండ గ్రామానికి చెందిన బాబు నాయక్ భూసమస్య పరిష్కరించడం లో అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహించిన బాధిత కుటుంబం కార్యాలయము వద్ద తాళ్ళతో వురేసుకునేన్దుకు ప్రయత్నించ గా పోలీసులు అడ్డుకున్నారు న్యాయం కోరుతూ రైతు కుటుంబం నిరసన వ్యక్తం చేసింది

8008574585Body:JhgConclusion:Kou
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.