ETV Bharat / state

తారకరత్నకు ఐసీయూలో చికిత్స.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు

author img

By

Published : Jan 28, 2023, 10:19 PM IST

బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. తారకరత్నకు అందుతున్న చికిత్స పై డాక్టర్ల తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు దైర్యం చెప్పారు.

Chandrababu
చంద్రబాబు

తారకరత్న కుటుంబ సభ్యులతో చంద్రబాబు

Chandrababu visits Hrudayalaya in Bangalore: నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.

మీడియాతో మాట్లాడిన చంద్రబాబు: ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కుప్పం కంటే బెంగళూరులో ట్రీట్‌మెంట్‌ బెటర్‌గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2గంటలకు ఇక్కడి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని పురందేశ్వరి చెప్పారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారని ఆమె వెల్లడించారు. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణ, నందమూరి సుహాసిని, పరిటాల శ్రీరామ్‌ ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు.

‘నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ, అక్కడికంటే బెంగళూరులో ట్రీట్‌మెంట్‌ బెటర్‌గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2గంటలకు ఇక్కడి తీసుకొచ్చారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోలుకోవడానికి ఇంకా టైమ్‌ పడుతుందని తెలిపారు. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్‌ బులెటిన్‌ కూడా విడుదల చేస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’- తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు

అసలేం ఏం జరిగిందంటే?: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.