ETV Bharat / state

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 4:43 PM IST

Updated : Dec 29, 2023, 4:57 PM IST

cbn_kuppam_second_day_tour
cbn_kuppam_second_day_tour

Chandrababu Kuppam Second Day Tour Updates: తెలుగుదేశం పార్టీకి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారని, రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా? అని ఆయన ప్రశ్నించారు.

Chandrababu Kuppam Second Day Tour Updates: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటించారు. నేటి పర్యటనలో ఆయన కుప్పం ఆర్‌అండ్‌బీ అతిధి భవనం వద్ద ప్రజల నుంచి భారీ ఎత్తున వినతులు స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి శాంతిపురం మండలానికి బయలుదేరారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు

Chandrababu Road Show in Shantipuram: శాంతిపురం మండలంలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీల నేతలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారన్న చంద్రబాబు, రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా? శిక్షించాలా? అని కుప్పం నియోజకవర్గం ప్రజల్ని చంద్రబాబు అడిగారు.

Chandrababu speech in Mahanadu: కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలి.. సమర శంఖం పూరించిన చంద్రబాబు

Chandrababu Comments: ''కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పంలో అభివృద్ధి జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పంకు ఏం చేసిందో చెప్పాలి? మేం ఉంటే హంద్రీనీవా కింద ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేవాళ్లం. హంద్రీనీవా పూర్తి చేసేందుకు రాత్రి, పగలు కష్టపడ్డాం. మేం 87 శాతం పనులు పూర్తి చేస్తే, మిగతా 13 శాతం చేయలేకపోయారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. దోచిన డబ్బంతా వసూలు చేస్తాం. వైఎస్ జగన్ పాలనలో వీరు చేసిందల్లా రౌడీయిజం, భూకబ్జాలు, గ్రానైట్‌ దొంగ వ్యాపారం'' అని చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.

Chandrababu Fire on YCP Leaders: నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన వైసీపీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా ఉంటారా? అని ఆయన నిలదీశారు. కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారని, రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతల వేధింపులతో చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. కొత్త చట్టం తెచ్చి, పేదల భూములన్నీ కాజేసేందుకు ఈ జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్న చంద్రబాబు, బ్రోకర్ల ద్వారా ఆన్‌లైన్‌లో భూముల రికార్డులు మార్చేస్తారని ఆగ్రహించారు.

Chandrababu Public Meeting at Ravulapalem: యువత గంజాయి మత్తుకు బానిసై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు: చంద్రబాబు

''నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామని హామీ ఇస్తున్నా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. మళ్లీ రైతు రాజ్యం వస్తుంది. రైతే రాజు అవుతారు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి ఏటా రూ.20 వేలు ఇచ్చే బాధ్యత నాది. గ్రానైట్ వ్యాపారులను పక్కనున్న పలమనేరు ఎమ్మెల్యే బెదిరించారు. ఇక్కడి మంత్రి కుటుంబం గ్రానైట్‌లో రూ.200 కోట్లు సంపాదించింది. భూమి శిస్తు, గ్రామాధికారి వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆర్‌ ప్రభుత్వమే.''- చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత.

CBN Tour : రాష్ట్ర భవిష్యత్​ కోసం పోరాడేందుకు సిద్ధం కావాలి : చంద్రబాబు

Last Updated :Dec 29, 2023, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.